Manchu Vishnu: “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే “మా” ఎన్నికలలో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో గత ఎన్నికల టైములో ఇచ్చిన హామీలను.. తన కాల పరిమితిలోకి పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. అయితే మంచు విష్ణు ఇచ్చిన హామీలలో “మా” బిల్డింగ్ ముఖ్యమైనది. “మా” అధ్యక్షుడిగా తాను భవనం నిర్మిస్తానని స్పష్టం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగి 24 గంటలు గడవకముందే “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకోవటం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
2021 అక్టోబర్ లో జరిగిన ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పై విష్ణు విజయం సాధించారు. అప్పట్లో ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ హీరోల సపోర్టు ఉంది. ఇక మంచు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ల మధ్య మాటలు యుద్ధం కూడా సాగింది. అయితే లోకల్ నాన్ లోకల్ అనే విధంగా ప్రకాష్ రాజు తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని.. తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించిన ఆయనకు అవగాహన లేదని అప్పట్లో బాగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో విష్ణు గెలుపొందడం జరిగింది.
రెండేళ్ల కాలానికి జరిగే ఎన్నికలకి సంబంధించి వచ్చే ఏడాది తన పోటీ చేయడం లేదని విష్ణు స్పష్టం చేశారు. ఇదే సమయంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని వచ్చే ఏడాది మేలోగా అన్ని నెరవేర్చలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఇండస్ట్రీ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!