ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిఫార్సు మేరకు ఎమ్మెల్సీలుగా ఎంపికైన జకియా ఖానమ్, రవీంద్ర బాబులు గవర్నర్ కోటాలో ఈరోజు నియామకమయ్యారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఇద్దరినీ నామినేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ రాజపత్రాన్ని విడుదల చేసారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను వైఎస్సార్సీపీ పార్టీ సభ్యులు అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు 2019లో పార్టీలో చేరినా సీటు దక్కలేదు. అయితే జగన్ అప్పుడు వేరే విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జకియా ఖానమ్ భర్త పార్టీ కోసం పనిచేస్తూ ప్రాణాలు విడిచారు. అందుకే ఆమెను వైఎస్ జగన్ సిఫార్సు చేసారు.