గత అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల్లో టిడిపిని బంపర్ మెజారిటీతో గెలిపించినందుకు చంద్రబాబు రిక్తహస్తం చూపారు.గెలిచిన ఎమ్మెల్యే వైసీపీలోకి పోవడం ప్రజల తప్పు కాదు కదా! ఆ చిన్న లాజిక్కును చంద్రబాబు మిస్సై చీరాల దళితులకు దూరమయ్యారు.
వివరాల్లోకి వెళితే ఇటీవల రెండు రాష్ట్ర వ్యాప్త సంఘటనలు సంచలనం రేపాయి.తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేశారు.ప్రకాశం జిల్లా చీరాలలో ఒక దళిత యువకుడు మాస్కు పెట్టుకోలేదని పోలీసులు కొట్టిన దెబ్బలకు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు.మొదటి సంఘటన కన్నా చీరాల ఘటన విషాదకరమైనది.అయితే చంద్రబాబు కెందుకో చీరాల పై కనికరం కలగలేదు.
తూర్పు గోదావరి జిల్లాలోని శిరోముండన బాధితునికి మాత్రం టిడిపి తరుపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు మంగళవారం ప్రకటించారు.అసలు ప్రాణాలే కోల్పోయిన చీరాల బాధిత యువకుడి కుటుంబానికి సాయం చేయటానికి మాత్రం చంద్రబాబుకు మనసు రాలేదు.చీరాల బాధితునికి ఆయన ఎటువంటి సాయాన్ని ప్రకటించలేదు.దీనితో దళితుల్లో కూడా తనకి అనుకూల,వ్యతిరేక వర్గాలను చూడడం చంద్రబాబుకే సాధ్యపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంకా చెప్పాలంటే చీరాల సంఘటనపట్ల ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నుండి స్పందనే కరువైంది.
ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి యడం బాలాజీ అమెరికాలో ఉండి కనీసం ఖండన కూడా పంపలేదు.చీరాల్లో ఉన్న టిడిపి నేతలకు ఈ సంఘటనే పట్టలేదు.అయితే వీరంతా కలిసి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం నిరాహారదీక్ష చేపట్టటం అనేది హాస్యాస్పదంగా ఉంది.అంటే వారివి మాత్రమే ప్రాణాలా?చీరాల దళిత యువకుడిది ప్రాణం కాదా?అయినా ఎన్ని అనుకుని ఏం లాభం? యథా చంద్రన్న !తధా తెలుగు తమ్ముళ్లు!!