Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. దాదాపు రెండు సంవత్సరాలపాటు సినిమాలు చేయకపోయినా గాని టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసబెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన హీరోలకు ఉన్న క్రేజ్ మాదిరిగానే తన క్రేజ్ కూడా ఉండేలా మెయింటెన్ చేయడం జరిగింది. రాజకీయాల్లో కూడా రాణిస్తూ తనలో దాగి ఉన్న రాజకీయ నాయకుడిని సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రస్తుతం సినిమా హీరో కంటే పొలిటికల్ గానే ప్రోజెక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.
జీరో బేస్డ్ పాలిటిక్స్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో గట్టిగానే స్థానాలు గెలవడం జరిగింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ ఇవటం తెలిసిందే.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు మీడియా సపోర్ట్ ఉన్నాగాని పవన్ పార్టీకి పెద్దగా లేదని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పెంచిన “జనసేన” పార్టీ పైకి రావాలని అభిమానులు సొంత డబ్బులతో అనేక రీతులుగా పార్టీ తరఫున అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తూన్నారు. దీనిలో భాగంగా తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నారై అభిమానులు..
జనసేన పార్టీ పొలిటికల్ గా పైకి ఇంకా లేపాలని, ఏకంగా శాటిలైట్ ఛానల్ ద్వారా జనసేన పార్టీని బాగా జనాల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అయినట్లు అందుకోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ముందుకు వచ్చినట్లు సరికొత్త వార్త ఇప్పుడు అటు సినిమారంగంలో ఇటు పొలిటికల్ రంగంలో వైరల్ అవుతుంది.ఈ విషయం తెలుసుకొని పవన్ ఆ టీం కి కోటి రూపాయలు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే పంచాయతీ ఎన్నికలలో పవన్ పార్టీ ఊహించని మేరకు భారీగా గెలవటానికి గల కారణం ఈ శాటిలైట్ ఛానల్ అని సరికొత్త టాక్ వినబడుతోంది.
.