Pawan Rana: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండో సినిమా దగ్గుబాటి రానా తో చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా అయ్యప్పన్ కొషియమ్ తెలుగులో రీమేక్ చేస్తున్న… ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీసు పాత్రలో నటిస్తుండగా రానా మిలట్రీ అధికారి గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు సగానికి పైగా అయిపోవడం జరిగింది. కరోనా రాకముందు సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా… జరగగా కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి షూటింగ్ ఆపేయటం జరిగింది.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటం ఆ తర్వాత కోల్పోవటం ప్రస్తుతం రెస్ట్ తీసుకుని మళ్ళీ పుంజుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి షిఫ్టింగ్ విషయంలో నిర్మాతలను పవన్ ఇప్పటికే స్పీడ్ పెంచాలని ఆదేశించటం జరిగింది. అయితే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు పవన్ అభిమానులు రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కి సినిమాల పరంగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అంటూ నిరుత్సాహం చెందారు. వాస్తవానికి మహమ్మారి కరోనా రాకపోయి ఉంటే “వకీళ్ సాబ్” సినిమా.. గత ఏడాది రిలీజ్ అయి ఉండేదని ఈ పాటికి మొగుడు సినిమాలు పవన్ రిలీజ్ చేసేవాడు అని చెప్పుకున్నారు.
Read More: Pawan Kalyan: దయచేసి నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు అంటున్న హీరో..!!
ఇటువంటి తరుణంలో తాజాగా జూలై నుండి ఇంకా పవన్ ఏకధాటిగా సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఫుల్ గా డిసైడ్ అయ్యారట. కాగా రానా తో జూలై 11 వ తారీకు హైదరాబాదులో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం స్పెషల్ గా వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో.. పవన్ కళ్యాణ్ పాల్గొని అప్పటి నుండి ఇక ఏకధాటిగా సినిమా కంప్లీట్ చేయాలని డిసైడ్ అవ్వడం జరిగిందట. పక్కా షెడ్యూల్ ఎక్కడా కూడా షూటింగ్కు అంతరాయం కలగకుండా ఇప్పటికే డైరెక్టర్లకు నిర్మాతలకు గట్టిగా పవన్ ఆదేశాలు ఇచ్చినట్లు ఏది ఏమైనా సినిమా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని నిర్మాతకి.. ఆర్థికంగా ఎటువంటి నష్టం రాకూడదని.. పవన్ ఆచితూచి సినిమా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట.