SBI: మన దేశంలో చాలా మందికి 18 ఏళ్లు దాటాయంటే చాలు ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ని తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ ) లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మనకి చైతన్య గోదావరి ఇలా ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ SBI ని మాత్రమే ఎక్కువగా నమ్ముతారు ఇండియన్ పీపుల్. అందువల్లే ఈ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయడం మరియు ఓపెన్ చేసిన అనంతరం డబ్బులను తీసుకోవడం కానీ వేయడం కానీ కష్టమైనప్పటికీ ఈ బ్యాంక్ ని ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు ప్రజలు.
ఎందుకంటే వారికి SBI మీద ఉన్న నమ్మకం. ఇతర బ్యాంకులలో అనేక రకాలుగా డబ్బులను చెల్లించాలి. అదే SBI లో అయితే మనకి మనీ కలిసి రావడంతో పాటు భద్రత కూడా ఉంటుందని భావిస్తారు. ఇక SBI యూజర్లను హడాలెత్తించే వార్త ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. గత కొంతకాలం నుంచి పాన్ కార్డ్ లింక్ చేయకపోతే SBI నుంచి క్లోజ్ చేస్తారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. చాలామంది యూజర్లకు తమ ఫోన్ కి కూడా ఈ మెసేజ్లను పంపించారు SBI అధికారులు.
అసలు పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఎందుకు ఎకౌంట్ క్లోజ్ చేస్తారు? ఇది నిజమా? అబద్ధమా? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇక తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఆ ఎకౌంటు SBI క్లోజ్ చేస్తుంది అన్న వార్త లో ఎంతవరకు నిజం ఉందో తెలియజేసింది ఈ కంపెనీ. ఇక ఇది మొత్తం సైబర్ నేరగాళ్ల పని అన్నట్లు తెలుస్తుంది. పీఐబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ ని జారీ చేసింది.
” గత కొద్ది రోజులుగా స్టేట్ బ్యాంక్ పేరును అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ పాన్ కార్డు నెంబర్ను అప్డేట్ చేసుకోండి.. లేదా ఖాతా క్లోజ్ అయిపోయింది రీఓపెన్ చేయండి… అని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని తీసుకుంటున్నారు. ఇలా SBI అధికారులు ఎప్పుడూ చేయరు. మీతో మా SBI అధికారులకు ఏదైనా అవసరం ఉంటే నేరుగా బ్యాంక్ కు రమ్మని అంటారు. ఇలాంటి వారిని అస్సలు నమ్మవద్దు. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ని ఎవరికి షేర్ చేయవద్దు ” అని హెచ్చరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.