ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు వారి కదలికలను చిత్రీకరించాయి.
కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలొడీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వాగు దాటుతుండగా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు ఫొటోలు తీశాయి. మావోల కదలికలకు సంబందించిన ఫోటోలు గమనించిన సరిహద్దు ప్రాంతాల పోలీస్ బలగాలు అప్రమత్తం అయ్యాయి.