బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజే మారిపోయింది. భారతదేశపు మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ తర్వాత చిత్రం ‘సాహో’ అంతగా లేకపోయినా బాలీవుడ్ లో కలెక్షన్లు కొల్లగొట్టింది.
ఇప్పుడు ప్రభాస్ పూజ హెగ్డే తో ‘రాధే శ్యామ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ తర్వాత చిత్రం ఉండబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆ చిత్రానికి సంబంధించి ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ వైజయంతి మూవీస్ ఒక క్రేజీ అప్ డేట్ విడుదల చేసింది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ 21 వ చిత్రంలో రెబల్ స్టార్ తో జోడీ కట్టనుంది .దీనితో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా లేకుండాపోయింది. ఇక పోతే ఇదే విషయాన్ని మన ‘న్యూస్ అర్బిట్’ నిన్ననే ప్రకటించడం గమనార్హం. మరిన్ని లేటెస్ట్ మూవీ మరియు పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!