యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే 15 రోజుల షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళారు. అక్కడ శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చి మిగతా షూటింగ్ మొత్తం సెట్స్ లో కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం భారీ హాస్పిటల్ సెట్ ని కూడా సిద్దం చేశారట.
గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుందని సమాచారం. అంతేకాదు ప్రభాస్ – పూజా హెగ్డే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారన్న టాక్ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెల్సిందే.
అయితే ప్రభాస్ నుంచి సాహో వచ్చి సంవత్సరం దాటిపోయింది. పెద్ద గ్యాప్ లేకుండానే రాధే శ్యామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రభాస్ ప్లాన్ చేసినప్పటికి కరోనా కారణంగా అనుకున్నట్టు సినిమాని పూర్తి చేయలేకపోయారు మేకర్స్. ఇక ఈ నెల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రానుందని సమాచారం.
అయితే అందరూ రాధే శ్యామ్ సంక్రాంతి బరిలో దిగితుందని భావించారు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటయ్యే సరికే డిసెంబర్ అయిపోతుందని తెలుస్తుంది. ఆ తర్వాత సీజీ వర్క్ కోసం చాలానే సమయం కేటాయించాల్సి వస్తుందని ఏ రకంగా చూసిన సంక్రాంతి బరిలో రాధే శ్యామ్ నిలిచే ఛాన్సే లేదని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!