ప్రభాస్ సన్నిహితుల తో కలిసి యూవి క్రియోషన్స్ అన్న బ్యానర్ ని స్థాపించి సాహో, రాధే శ్యాం లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో మారుతి, సుజీత్ లాంటి డైరెక్టర్స్ తో పాటు రవితేజ, శర్వానంద్, రాం చరణ్, నాని లాంటి హీరోల డేట్స్ కూడా లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్స్ సెట్ చేసి సినిమాలని నిర్మించనున్నారు.
ఇప్పటికే మారుతి – రవితేజ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్యానర్ తో ఇప్పుడు ప్రభాస్ పెదనాన్న నిర్మాణ సంస్థ గోపీకృష్ణ కూడా కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్స్ కలిపే ఇప్పుడు రాధే శ్యాం సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ప్రభాస్ ఇప్పుడు యూవీ లోకి టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ ని తీసుకున్నట్టు సమాచారం. చేసింది తక్కువ సినిమాలే అయినా మహి వి రాఘవ్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది.
‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంటరయిన మహి వి రాఘవ ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ‘యాత్ర’ అన్న సినిమాని తీశాడు. ఈ రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. కాగా యాత్ర 2 తీయబోతున్నట్టు ఆ మధ్య వెల్లడించాడు మహి వి రాఘవ. కాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ ఏదీ మళ్ళీ రాలేదు.
కాగా ఈ మధ్య అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో కూడా సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాని అఫీషియల్ గా మాత్రం ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. కాగా తాజాగా మహి వి రాఘవ యూవీ క్రియేషన్స్ లో చేరినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటి నుంచి మహి వి రాఘవ చేసే సినిమాలు యూవీ క్రియేషన్స్ లో నిర్మిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!