టాలీవుడ్ టాప్ మోస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. బాహుబలి చిత్రం ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైన ప్రభాస్ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక క్షణం లేకుండా గడుపుతున్న ప్రభాస్ తన చిత్రాల షూటింగ్ లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రైవేట్ ఫ్లైట్ తెచ్చుకున్నాడు.
కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.దీంతో అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. దీంతో షూటింగ్ మొత్తం ఆగిపోయాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో తిరిగి చిత్ర పరిశ్రమలో షూటింగులు మొదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చిత్రబృందం షూటింగుల్లో పాల్గొంటున్న విషయం తెలిసినదే.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ కోసం ఇటీవలే చిత్రబృందం మొత్తం ఇటలీ వెళ్లి తమ షెడ్యూల్ ను పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రతిసారి అలా జనాలలో వెళ్లి షూటింగ్ లు జరుపుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదిరేపని కాబట్టి, ఇలాంటి ప్రయాణాలు చేయడానికి ప్రభాస్ ఏకంగా ఒక ప్రైవేట్ ఫ్లైట్ ను వాడుతున్నారు.
ఇటలీ నుంచి ప్రభాస్ ts షూటింగ్ పూర్తి చేసుకొని తన ప్రవేట్ ఫ్లైట్ లో ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బయట తిరగడం మంచిది కాదని భావించిన ప్రభాస్ తన ఎన్ఆర్ఐ ఫ్రెండు నుంచి ఈ విమానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపించని ప్రభాస్ ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ ఫ్లైట్లో వెళ్తున్నారు.
ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం తర్వాత ఓం రౌత్ తెరకెక్కించబోయే చిత్రం ఆదిపురుష్ మీటింగ్ కోసం ప్రభాస్ హైదరాబాద్ నుంచి ముంబై కి తన ప్రైవేట్ ఫ్లైట్ లోనే వెళ్లాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!