Prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే ఈ సినిమాకి రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. 250 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటోంది. ప్రభాస్ నుంచి సాహో వచ్చి రెండేళ్ళు దాటిపోవడంతో రాధేశ్యామ్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ సస్పెన్స్ ని మేయింటైన్ చేస్తున్నారు.
కారణం ఏంటో తెలీదు గాని మేకర్స్ ఎంత సస్పెన్స్ గా రిలీజ్ డేట్ ని ఉంచినప్పటికి రిలీజ్ డేట్ ఇదే అంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది. వాస్తవంగా రాధేశ్యామ్ జూలై 12 న రిలీజ్ అన్న టాక్ వినిపించింది. అయితే అది మరీ లాంగ్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే అసలు డేట్ అది కాదని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ని ఫైనల్ చేశారట. ఈ సర్ప్రైజింగ్ న్యూస్ రివీల్ చేయడానికి మాత్రం కాస్త సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయట.
Prabhas : వరసగా టాలీవుడ్ సినిమాలన్ని రిలీజ్ కి రెడీ ..!
ఒకటి ఈ సినిమా వీఎఫెక్స్ వర్క్ కి ఇంకా కాస్త సమయం పడుతుంది కాబట్టి ముందే రిలీజ్ డేట్ ని ప్రకటించడం లేదట. ఇక వరసగా సినిమాల రిలీజ్ డేట్ కూడా ఉండటం తో అవసరమైతే పోస్ట్ పోన్ చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దాదాపు ఏప్రిల్ 30 మాత్రం ఫిక్సైనట్టే అంటున్నారు. కాగా తాజాగా టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేశారు దర్శక, నిర్మాతలు. పుష్ప.. గని..ఎఫ్ 3.. ఉప్పెన..సినిమాలతో పాటు చెక్.. ఆర్ ఆర్ ఆర్..రంగ్ దే..ఇలా మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!