Bigg Boss Telugu 5: బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో… మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఏడు వారాల ఆట ముగియడంతో ఏడుగురు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. ఏడో వారం మొన్న ఇంటి నుండి ప్రియ ఆంటీ (priya aunty)అవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రియ ఆంటీ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం… సన్నీ పట్ల వింత ప్రవర్తన అని బయట జనాలు ఎక్కువగా డిస్కషన్ చేస్తున్నారు.
సన్నీ(Sunny) తో గొడవ పడటం.. మాత్రమే కాక వాడు వీడు అంటూ.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తోపాటు చంప పగిలిద్ది అని.. తోటి కంటెస్టెంట్ పై ఇష్టానుసారంగా.. ప్రియ ఆంటీ వ్యవహరించడంతో ఆమెపై ఏడ వారంలో నెగిటివ్ బాగా పెరిగి పోయిందని అందువల్లే ఓటింగ్ లో… ఓట్లు రాబట్టలేక చివరాకరికి ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని బయట జనాలు చెప్పుకుంటున్నారు.
3వారం లోనే… ఎలిమినేషన్ కావాల్సిన కంటెస్టెంట్
ఒక్క సన్నివేశంలో మాత్రమే కాక అంతకుముందు లహరి.. రవి గోడవ సమయంలో కూడా ప్రియ ఆంటీ చాలా మాటలు వదిలేయడంతో.. అప్పుడే ఆమెపై నెగిటివిటీ ప్రారంభమైందని అది చివరాకరికి పెరుగుతూ పెరుగుతూ ఏడో వారంలో మరింత ముదిరి పోయింది అని వాస్తవానికి ప్రియ అంటి మూడవ వారం లోనే… ఎలిమినేషన్ కావాల్సిన కంటెస్టెంట్ అని.. బయట జనాల టాక్. ఇదిలా ఉంటే ఏడువారాలకి గాను.. ప్రియ ఆంటీ(priya aunty) కి.. వారానికి లక్షన్నర లెక్కగట్టి 7 వారాలకు 10 లక్షలకు పైగా.. రెమ్యున్ రేషన్ బిగ్ బాస్ (Bigg Boss)షో నిర్వాహకులు ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అదనంగా కూడా డబ్బులు ప్రియ ఆంటీ కి ముట్టినట్లు వార్తలు వస్తున్నాయి.