తన పాటలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆ గాన గంధర్వుడు అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు.
తింటే గారెలే తినాలి వింటే ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలువినాలి అన్న రేంజిలో ఆయన ప్రస్థానం సాగింది.నేపథ్య గాయకుడు గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా సంగీత దర్శకుడిగా నిర్మాతగా బహుముఖ పాత్రలు సినిమారంగంలో పోషించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక లెజెండ్ డనడంలో సందేహం లేదు లెజెండ్ అనడంలో సందేహం లేదు.ఇటీవలే తీవ్ర అస్వస్థతతో అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అరుదైన పురస్కారం లభించింది.అయితే ఇది ఆయన పుట్టిపెరిగిన ఆంధ్రప్రదేశ్ లో కాదు.
సుదీర్ఘకాలం చెన్నైలోనే ఉండిపోయిన సుదీర్ఘకాలం చెన్నైలోనే ఉండిపోయిన ఆయన గౌరవార్థం పుదుచ్చేరిలోని ఓ బేకరీ.. బాలు చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసింది. ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జుకా చాక్లెట్ కేఫ్ చెఫ్ రాజేంద్రన్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్తో నిర్మించిన ఈ విగ్రహం బరువు 339 కిలోలు మరియు ఎత్తు 5.8 అడుగులు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటల సమయం పట్టిందని కేఫ్ బృందం పేర్కొంది.
ప్రజల సందర్శనార్థం ఈ విగ్రహాన్ని జనవరి 3 వరకు అందుబాటులో ఉంచుతామని కేఫ్ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 5న కరోనావైరస్ బారినపడిన బాలు.. ఆగస్టు 13న మరింత అనారోగ్యానికి గురయ్యారు. వైరస్ ప్రభావంతో ఆయన ఊపిరితిత్తుల చెడిపోవడంతో సెప్టెంబర్ 25న మరణించారు.పుదుచ్చేరి బేకరీ ఓనర్ స్ఫూర్తితో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా ప్రముఖ సాంస్కృతిక సంస్థలు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మృతులను రాష్ట్రంలో నిలిపేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు!