వాస్తవాధీన రేఖ ఆవల ఇండియా వాయసేన జరిపిన దాడిని కాంగ్రెస్ శ్లాఘించింది. తెల్లవారు ఝామున యుద్ధవిమానాలు బాల్కోట్ వద్ద జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబు దాడులు జరిపింది. తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమై సమీక్ష జరిపింది. అ తర్వాత మాత్రమే అధికారికంగా వైమానిక దాడులను ప్రకటించారు.
అధికారిక ధృవీకరణ రాగానే ప్రతిపక్షాలు వైమానికబలగాన్ని శ్లాఘించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందరికన్నా ముందు భారత వాయుసేన పైలట్లకు శాల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్లకు వందనం సమర్పించింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, ఆర్జెడి నాయకుడు తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వాయుసేనను కొనియాడారు.
?? I salute the pilots of the IAF. ??
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019