బాబు రాజకీయ స్వార్ధానికి… ఆకలికి అంతు ఉండదు. అవసరం ఉంటే ఒకలా… లేకపోతే మరోలా నాయకుల్ని వాడుకుంటారని., అందుకే ఆయన్ను రాజకీయ ఊసరవెల్లి అంటుంటారు. తాజాగా మరోసారి ఆయన అదే నిరూపించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేము అని తెలిసి కూడా ఒక అల్ప వర్గానికి చెందిన నాయకుడిని పోటీలో దించారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలున్న బాబు…, గెలవలేరు అని అందరికీ తెలుసు. కానీ పార్టీలో ఏ ప్రముఖుడికో.., ఏ ఉన్నత వర్గ నాయకుడికో ఇవ్వకుండా…, ఆ పార్టీలో బలంగా వాయిస్ వినిపించే ఎస్సి నాయకుడు వార్ల రామయ్యకు కేటాయించారు. ఇది విమర్శలకు తావిస్తోంది. బాబు తరహా స్వార్ధం మరోసారి రుజువయ్యిందని.., సామాజికవర్గ బేధం, అహం మరోసారి బయటపడింది అంటూ అధికార పక్షం నుండి విమర్శలు వస్తున్నాయి.
అవును… కచ్చితంగా గెలిచే పందెంలో తమ సామాజిక వర్గం వారినో, లేక కోటీశ్వరుడినో, బడా వ్యాపారావేత్తనో నిలబెట్టి గట్టెక్కించి… ఎట్టిపరిస్థితుల్లోనూ 100 కి 100శాతం గెలవము అని తనకు కూడా తెలిసిన పందెంలో నిలబెట్టి.. చిల్లర రాజకీయాలు చేయ తలపెట్టారని అంటున్నారు! ఇంతకూ ఇదంతా ఏమిటంటారా… జూన్ 19న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జరగబోయే ఓటింగ్ గురించి.. ఆ ఎన్నికల్లో తమకున్న ఎమ్మెల్యే సీట్ల ప్రకారం చూసుకుంటే ఒక్క సీటూ రాదని తెలిసినా బాబు చేస్తున్న రాజకీయం.
ఏపీకి సంబంధించి నలుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కావాల్సి ఉన్న క్రమంలో… ఇప్పటికే అందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. అసెంబ్లీ కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి, బలాబలాలను బట్టి 151 ఒక్క సీట్లు ఉన్న వైకాపాకి.. ఉన్న నాలుగు సీట్లూ సొంతం అయిపోగా… 23 మంది ఎమ్మెల్యేల బలాన్ని కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్క రాజ్యసభ సీటును కూడా పొందే అవకాశం లేదు! ఈ విషయం తెలిసి కూడా 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబు… కావాలని వర్ల రామయ్య చేత నామినేషన్ వేయించారు.
బాబు ఇంకా ఇలాంటి రాజకీయాలు చేయడం మానడం లేదని, ఇలా ఆలోచించ బట్టే పార్టీ పరిస్థితి ఇలా మిగిలిందని.. దళితుల విషయంలో బాబు ఇంకా ఎందుకు ఇంత చిల్లరగా ఆలోచిస్తున్నారని.. 2019లో కొట్టిన దెబ్బ ఇంకా గట్టిగా కొట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారని దళిత నేతలు వాపోతున్నారు! కాగా… దళితులతో ఆడుకోవడం ఆపవా బాబు అంటూ ఆన్ లైన్ వేదికగా ప్రశ్నల వర్షాలు కురుస్తున్నాయి! బాబు ఇంకా గతంలోనే ఉండిపోయారని, అప్ డేట్ అయ్యే అవకాశాలు లేవని కామెంట్లు పడుతున్నాయి!