Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan త్వరలో రాజమండ్రికి రాబోతున్నారట. మేటర్ లోకి వెళ్తే ఉప్పెన సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో..ఈ గ్రాండ్ సక్సెస్ కార్యక్రమాన్ని సినిమా యూనిట్ రాజమండ్రిలో చేయడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నీ చీఫ్ గెస్ట్ గా పిలిచే ఆలోచనలో సినిమా యూనిట్ వున్నట్లు ఫిలింనగర్ లో టాక్. రాజమండ్రిలో చిరంజీవి కుటుంబానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని చోట్ల కంటే ఎక్కువగా ఉండటంతో ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో జనాల్లోకి మరింతగా మెగాహీరో వైష్ణవ తేజ్ ని ప్రమోట్ చేయడానికి మెగా ఫ్యామిలీ ఈ విధంగా ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా మొదటి షో నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటం మాత్రమే కాక ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టిస్తుంది.
ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా మంచి అగ్రహీరోలు స్పందించడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉప్పెన టీంకి శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. ఇలాంటి తరుణంలో సినిమా బాగా సక్సెస్ కావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు మరియు నిర్మాతలు ఈ సినిమాని మరింత గా ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయినట్లు త్వరలోనే రాజమండ్రిలో భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ ఊహించని విధంగా విజయం సాధించడంతో పాటు రామ్ చరణ్ మొదటి సినిమా “చిరుత” డేబ్యూ మూవీ రికార్డులను పగలగొట్టడం విశేషం.