తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు.. ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులకు విమర్శలు చేసే విషయంలో రాజకీయనాయకులకు ఉన్నంత పేరు ఉంది! గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రెస్ మీట్లలో.. బాబు ప్రభుత్వంపై పింక్ డైమడ్లపై చేసిన ఆరోపణలు అప్పట్లో సంచనలనం! ఆ సంగతులు అలా ఉంటే… ప్రస్తుతం గౌరవప్రధాన అర్చకక పదవిని.. నామమాత్రపు రాజ్యాధినేత పదవిగా భావిస్తుణ్న దీక్షితులు… శపారపర్య అర్చకులను విధుల్లోకి తీసుకోవడంపై అసంతృప్తిని వెళ్లగగ్గుతున్నారు.
అవును… ప్రధాన అర్చక స్థాయినుంచి ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు గతంలో బాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో… బాబు తన స్టైల్లో స్పందింఇచి వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ ఇచ్చేశారు! దీంతో మరింత ఫైరయిన దీక్షితులు… బాబును వైకాపా – బీజేపీల రేంజ్ లో విమర్శించేవారు! ఫలితంగా జగన్ ప్రభుత్వం వచ్చిన అనంతరం తనకు మళ్లీ ప్రధాన అర్చక పదవి లభిస్తోందని ఆశించి ఉండొచ్చు! కానీ… అలా జరగలేదు!!
కానీ కోర్టు కేసుల ఫలితంగా ఆయనకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి మాత్రమే ఇచ్చారు. ఆలయంలో తాను అనుకున్నది జరిగించడానికి, టీడీపీ నేతలు చెబుతున్నట్లు కొండమీద పెత్తనం చేయడానికి..ఆ పదవి సరిపోవడం లేదు. ఇలాంటి విషయాల్లో పెద్దగా కల్పించుకునే అలవాటు లేని జగన్… ఈ విషయం ఏమీ చేయలేకపోవడంతో… ప్రస్తుతం నేరుగా జగన్ ను కలిసి, తన బాద చెప్పుకోవాలనే తలంపులో, ప్రయత్నాల్లో దీక్షితులు ఉన్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా.. బాబు హయాంలో నియమించిన అధికారులంతా.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీక్షితులు. మరి ఈ ఆరోపణలు అయినా జగన్ దగ్గరకు అనుమతి లభించడానికి ఉపయోగపడతాయని రమణ దీక్షితుల ఆలోచన నెరవేరుతుందో లేదో చూడాలి!