రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మాత్రమే కాదు.. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. రేణుకు కూడా ప్రస్తుతం బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు బుల్లితెర మీద కూడా అప్పుడప్పుడు ఆమె సందడి చేస్తోంది. కొన్ని షోలకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా.. యాంకర్ సుమ చానెల్ సుమక్కలో తాజాగా పాల్గొన్న రేణు.. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రేణు దేశాయ్ ది పూణె అని అందరికీ తెలిసిందే. తను మరాఠీ. తను ఓ రైతు బిడ్డ. తన చిన్నప్పటి నుంచి రైతులను చూస్తూ పెరిగిందట. తనకు రైతుల బాధలు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను రైతులను చూస్తూ పెరిగా. పొలంలోనే ఎక్కువగా తిరిగేదాన్ని. నాకు నాటు వేయడం తెలుసు. వ్యవసాయం గురించి నాకు అంతా తెలుసు. అందుకే.. రైతుల కోసం ఏదైనా చేయాలన్నది నా లక్ష్యం. రైతుల గురించి ఏదైనా చేయాలి అనేది నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు.. అది చిన్నప్పటి నుంచి ఉంది. దాని కోసమే త్వరలోనే ఓ ఎన్జీవో ప్రారంభించబోతున్నాను.. అంటూ రేణు దేశాయ్ తన మనసులోని మాటను బయటపెట్టింది.
రేణు దేశాయ్ ప్రస్తుతం రైతుల మీద ఓ మరాఠీ సినిమాతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోందట. మొత్తం మీద రేణు దేశాయ్ గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలను సుమక్క ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ వీడియో చూసి రేణు దేశాయ్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి.