మరోసారి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్లో రెడ్హాండెడ్గా ఇరుక్కు పోయాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.గతంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు శాసనమండలి ఎన్నికల్లో ఓటు కోసం నగదు ఇస్తూ ఎసిబికి రేవంత్రెడ్డి ఎసిబికి దొరికిపోయిన విషయం తెలిసిందే. అదే ఓటుకునోటు కేసుగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఆ కేసు విచారణ జరుగుతూనే ఉంది.
ఈలోపే రేవంత్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ పై యుద్ధం ప్రకటించాడు.అది అనేక మలుపులు తిరుగుతూ వచ్చి చివరకు కాంగ్రెస్ నేతలకే చుట్టుకోవడంతో రేవంతరెడ్డి పని పెనంపై పడినట్లయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.కెసిఆర్ పన్నిన వ్యూహంలో రేవంతరెడ్డి అభిమన్యుడిలా చిక్కుకు పోయారన్నది వారి విశ్లేషణ
కేటీఆర్ ఫాంహౌస్ పై భీకరపోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మొన్నటిదాకా టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు. ఈ మౌనం వెనుక అంతుచిక్కని వ్యూహం ఉంది.వివరాల్లోకి వెళితే …
కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 111 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడారు. కేటీఆర్ ఫాంహౌస్ అలానే అక్రమంగా కట్టారన్నారు. ఇప్పుడు ఇదే జీవోపై హైదరాబాద్ లో ఎక్కువ నిర్మాణాలు కాంగ్రెస్ నేతలకే ఎక్కువ ఉన్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి జీవో పరిధిలో ఎక్కువ ఫాంహౌస్ లు కాంగ్రెస్ లీడర్లకే ఉన్నాయని సమాచారం తెప్పించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేసి కూల్చాలని ప్రయత్నాలు మొదలెట్టినట్లు ఆ వర్గాలు వివరించాయి .. ఇప్పుడు రేవంత్ కదిపిన 111 జీవో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.దీంతో వారు రేవంత్ రెడ్డి పైన నిప్పులు చిమ్ముతున్నారు.అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేద్దామని 111 జీవో తెస్తే ఇప్పుడు అదే తమ పాలిట పెను అస్త్రంగా మారిందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
కాగా టీఆర్ఎస్ సర్కార్ కావాలనే కేటీఆర్ ఫాంహౌస్ తో కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ లు కూల్చాలని ఈ స్కెచ్ వేసినట్టు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.రేవంత్ రెడ్డిని ఇందులో కెసిఆర్ వ్యూహాత్మకంగా బుక్ చేశారని అనుకుంటున్నారు.