Road Accidents: రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో ఈ వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం పాలైయ్యారు. కర్నాటకలో జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, రాజస్తాన్ లో కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.
రాజస్థాన్ లోని బీకేనేర్ – జోధ్ పుర్ జాతీయ రహదారిపై ఓ కారు- ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. శ్రీ బాలాజీ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇక కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలో వేకువజామున అతివేగంగా వస్తున్న ఆడి కారు విద్యుత్ స్తంబానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా 20 ఏళ్ల యువతీ, యువకులే నని పోలీసులు తెలిపారు. ముగ్గురు యువతులు, నలుగురు యువకులు కలిసి కారులో అతివేగంగా వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఇవి కూడా చదవండి..
1.YV Subba Reddy: టీటీడీలో నిత్య అన్నదాన పథకం అమలుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇదీ..
2.AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?
3.BREAKING: ప్రెస్ మీట్ పెట్టబోతున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి భారీ ప్రకటన రాబోతోందా..?