YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వహిస్తున్న అన్నదాన పథకం రద్దు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ సెక్షన్ మీడియా ఈ విషయం వాస్తవమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహించింది. దీంతో నిత్య అన్నదాన పథకం అమలుపై భక్తుల్లో అయోమయానికి దారి తీసింది. అయితే దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
నిత్యాన్నదానం నిరంతరం కొనసాగుతుంది
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వరి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొందరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారా చేస్తున్నారనీ, వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ గోశాలలో సోమవారం కోకులాష్టమి గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసిన సాంప్రదాయ భోజనం భక్తులకు అందించాలని అధికారులు ఆలోచన చేశారనీ, దీన్ని నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు.
YV Subba Reddy: నవనీత సేవ
శ్రీవారికి నిత్యం జరిగే నవనీత సేవ కోసం దేశవాళీ ఆవుల నుండి వెన్న సేకరించేందుకు నవనీత సేవ ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నిత్యం సమర్పించే ప్రసాదాలను తయారు చేయిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మే 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగే ఏర్పాట్లు చేశామన్నారు. ఇందు కోసం పాలకమండలికి అధికారులకు అవసరమైన శక్తి ఇవ్వాలని స్వామివారిని ప్రార్ధించినట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
2. Mother tortured son: మాతృత్వానికి మాయని మచ్చ.. ఈ కన్న తల్లి కిరాతకత్వం..
3. AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!