AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రో ధరల విషయంలో లోక్ సభలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ప్రకటన ఏపి రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా ఉండటంతో రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. కన్ఫూజన్కు కారణం కావడంతో ఏపి రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. వైజాగ్ ఏపి రాజధాని అని చెప్పడం తమ ఉద్దేశం కాదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.
విశాఖ ఏపి రాజధాని కాదనీ, అది ఒక నగరం మాత్రమేనని వెల్లడించింది. పెట్రోలియం ట్యాక్స్ కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని పేర్కొంది. హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. హెడ్డింగ్ లో క్యాపిటల్ తో పాటు సమాచారం సేకరించిన నగరం పేరును ఇప్పుడు చేర్చుతున్నామని ప్రకటించింది. లోక్ సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామనీ, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. హర్యానాలోని అంబాలా, పంజాబ్ లోని జలంధర్ నగరాలను సైతం ఉదాహరణగా తీసుకున్నామని, అంబాలా, జలంధర్ నగరాలు ఆయా రాష్ట్రాల రాజధానులు కావని కేంద్రం వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..