హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీఆర్ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తన ఛాంబర్లో సైదిరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైదిరెడ్డి 43 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే తనను భారీ మెజార్టీతో గెలిపించాయని సైదిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఉత్తమ్ చేసిన 30 ఏళ్ల అభివృద్ధిని.. తాను మూడున్నరేళ్లలోనే చేసి చూపిస్తానని సైదిరెడ్డి పునరుద్ఘాటించారు.