సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత వెంటనే సినిమా మొదలు పెట్టాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నప్పటికి కోవిడ్ వల్ల కుదరలేదు. పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అన్న సినిమాని ప్రకటించిన మహేష్ బాబు గత ఆగస్టు లోనే షూటింగ్ మొదలు పెట్టాలని భావించాడు. కాని కరోనా లాక్ డౌన్ తో మొదలు పెట్టలేకపోయారు. ఆ తర్వాత అన్ని సెట్ చేసుకొని హైదరాబాద్ లో భారి బ్యాంక్ సెట్ నిర్మించారు.. అందులోనే సర్కారు వారి పాట షూటింగ్ మొదలవబోతుందని ప్రచారం జరిగింది. కాని మళ్ళీ ఇక్కడ కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అమెరికాలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని లొకేషన్స్ కూడా ఫైనల్ చేసుకొచ్చారు.
కాని సర్కారు వారి పాట యూనిట్ సభ్యులలో కొంతమందికి వీసా రాకపోవడంతో షూటింగ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని డిసెంబర్ నుంచి లేదా జనవరి నుంచి మొదలవనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ నుంచి సక్రారు పాట మొదలవడం కష్టమని తెలుస్తోంది. విదేశాలలో కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా ఉండటంతో కుదిరితే జనవరి నుంచి అమెరికాలో ప్లాన్ చేసుకుందామని భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ షెడ్యూల్ 45 రోజులు ప్లాన్ చేశారు.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట స్క్రిప్ట్ లో కొంత మార్పులు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దాని విదేశాలలో జరిగే ఎపిసోడ్ ని తగ్గిస్తున్నట్టు దాని వల్ల అమెరికా షెడ్యూల్ డేస్ తగ్గించాలని చూస్తున్నారట. ఒకవేళ అమెరికా షెడ్యూల్ గనక ఇప్పుడు చేయడం కుదరక పోతే అనుకున్న ప్రకారం జనవరి నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టాలని ఇక డిలే చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచార. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్ధిక నేరస్థుడి పాత్రలో కనిపిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.