SBI: భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతున్న ఎస్బిఐ (SBI) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సేవలను పల్లె పల్లెల్లో విస్తరించి బ్యాంకింగ్ పరంగా భారతీయులకు ఎస్బిఐ ఎన్నో సేవలను అందిస్తోంది. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉన్నవారికి బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇందులో భాగంగా తాజాగా ఒక సంవత్సరానికి 340 రూపాయల చొప్పున నాలుగు లక్షల వరకు ఇన్సూరెన్స్ ను మనం పొందవచ్చు.
SBI: ఎస్బీఐలో అకౌంట్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే..!
ఎస్బిఐ గుడ్ న్యూస్:
తాజాగా కేంద్ర ప్రభుత్వం భారతీయులకు రెండు రకాల ఇన్సూరెన్స్ స్కీములను అందించనుంది. వీటివలన భారతీయుడికి చాలా బెనిఫిట్ అందబోతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY) స్కీం ల కింద ఎస్బిఐ కస్టమర్లకు ఇన్సూరెన్స్ స్కీములను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా (SOCIAL MEDIA)ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.
SBI alert: ఎస్బీఐ అకౌంట్లు స్తంభిస్తాయి..! అలా జరగకుండా ఉండాలంటే కొత్త రూల్స్ పాటించాలి..!!
ఈ స్కీం కు ఎవరెవరు అర్హులు:
ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ స్కీముల ఉద్దేశం ఎవరైనా వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు వారికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ పాలసీదారుడు మరణిస్తే అతనికి రావాల్సిన డబ్బును అతడు పొందుపరిచిన నామినికి బదిలీ చేయబడతాయి. ఇందులో భాగంగా 18 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ స్కీం కు అర్హుడు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కోసం ఏడాదికి ఎస్బిఐ ఖాతాదారుడు 12 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక మరోవైపు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద ఎస్బిఐ ఖాతాదారుడుకి 2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. ఇందుకోసం ఎస్బిఐ ఖాతాదారుడు సంవత్సరానికి 340 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కు 18 నుంచి 50 సంవత్సరాలు కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ఇన్సూరెన్స్(INSURANCE) స్కీములను ఉపయోగించి మీ జీవితానికి అతి సులువుగా పొందుపరచుకొండి.
SBI Charges: మీకు ఎస్బిఐలో అకౌంట్ ఉందా.. జూలై 1 నుంచి చాలా మారుతున్నాయి.. వెంటనే తెలుసుకోండి..!!