టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. ఎవరు లాంటి సూపర్ హిట్ తర్వాత అడవి శేష్ నటిస్తున్న సినిమా అందులోను ఈ సినిమా బయోపిక్ కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇక మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతుంది కాబట్టి ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంతక ముందు శేష్ తో గూఢచారి వంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో శోభిత ధూళిపాల్ల, బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 26/11 దాడిలో మృతి చెందిన ఎన్ ఎస్ జీ కమెండ్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వాస్తవంగా అయితే ఈ సినిమా గత ఏడాదిలోనే పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాలు ఆ తర్వాత కరోనా వల్ల షూటింగ్ జరపలేకపోయారు.
అయితే లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో తన పార్ట్ ను పూర్తి చేసుకున్నట్లుగా శోభిత ధూళిపాల్ల వెల్లడించింది. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి ఇతర యూనిట్ సభ్యులందరికి కూడా కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఈ సినిమా డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి 2021 ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక మహేష్ నిర్మాణం లో తెరకెక్కుతున్నప్పటికి అడవి శేష్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా బాధ్యత మొత్తం మహేష్ అడవి శేష్ మీదే వదిలేశాడట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!