గడిచిన కాలాన్ని కళ్ళకు కట్టే విజ్ఞాన గది మ్యూజియం.. అదే వాహన ప్రియులకు అయితే పాత కాలం బైక్స్ కోసం బైక్స్ మ్యూజియం కి వెళ్తారు.. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బైక్ లు ఉన్న మ్యూజియంలో ఇటీవల మంటలు చెలరేగాయి.. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రేమికులందరిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఈ సంఘటన ఆస్ట్రియా లోని టిమ్మోల్స్ జాక్ లోని టాప్ మౌంటైన్ క్రాస్ పాయింట్ మ్యూజియం లో చోటు చేసుకుంది.. ఈ సంఘటన జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
టాప్ మౌంటైన్ క్రాస్ పాయింట్ మ్యూజియం ప్రపంచంలోనే ఎత్తైన మోటార్సైకిల్ మ్యూజియం. దీనిని 2016 లో ప్రారంభించారు.ఈ మ్యూజియంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రపంచ నలుమూలల నుండి 100 కు పైగా బ్రాండ్లకు చెందిన 230 మోటార్ సైకిల్ లు ఉన్నాయి. ఇది మోటార్ సైకిల్ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం తెలిపారు.ఈ మ్యూజియంలో బైక్స్ తో పాటు కొన్ని కార్లను కూడా పార్క్ చేసినట్లు నివేదికలో తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగామూసి వేశారు. జనవరి 24న ప్రదర్శన కోసం సిద్ధమవుతోంది.
ఈ మోటార్ సైకిల్ మ్యూజియంలో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు 2003 సంవత్సరంలో బ్రిటిష్ నేషనల్ మోటార్ సైకిల్ మ్యూజియంలో 380 ప్రీమియం మోటార్సైకిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం మాత్రమే కాదు ప్రాణ నష్టం కూడా జరిగింది. నివేదికల ప్రకారం, ఈ మ్యూజియం లో వంటలు చెలరేగినప్పుడు కంపెనీ ఉద్యోగుల లో ఒకరు ఫైర్ అలారం సౌండ్ విని లేచి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి : గూగుల్ కి పోటీ ఇస్తున్న కొత్త సెర్చ్ ఇంజిన్.. దాని యూజర్స్ ఎంతో తెలిస్తే షాకె