Social Media : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి తెలియని వారు ఉండరు. అమెరికా మాజీ అధ్యక్షుడిగా,రాజకీయవేత్తగా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా డోనాల్డ్ ట్రంప్ అందరికీ సూపరిచితుడే. అయితే తాజాగా డోనాల్ట్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకుని సోషల్ మీడియా దిగ్గజాలు అయిన ఫేస్బుక్, ట్విట్టర్లకు ఝలక్ ఇచ్చారు. సోషల్ మీడియా దిగ్గజాలు అయిన ఫేస్బుక్,ట్విట్టర్ లకు పోటిగా ఒక సరికొత్త యాప్ను విడుదల చేశాడు డోనాల్డ్ ట్రంప్. ఒకానొక సమయంలో సోషల్ మీడియా యాప్ ఓనర్లు తన పట్ల వివక్ష చూపి,ఏకపక్షంగా వ్యవహరించారని ట్రంప్ ఆరోపణలు చేసి సోషల్ మీడియా దిగ్గజాలకు పోటీగా తన కంపెనీ నుంచి ట్రూత్ సోషల్ పేరుతో ఓ యాప్ని రిలీజ్ చేశాడు.
Social Media : ట్రూత్ సోషల్ యాప్
వివరాల్లోకి వెళితే, 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల తీరును విమర్శిస్తూ ఫేస్బుక్, ట్విట్టర్లో పలు రకాల కామెంట్లు చేశారు ట్రంప్. అయితే ఆ కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని
ట్విట్టర్, ఫేస్బుక్లు అతడిపై కొరడా ఝళిపించాయి. దీంతో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను 2021 అక్టోబరులో స్థాపించడం జరిగింది. తాజాగా ఈ గ్రూపు ట్రూత్ సోషల్ యాప్ను రూపొందించింది.
అన్ని ప్లాట్ఫార్మ్లపై అందరికీ ట్రూత్ యాప్ అందుబాటులోకి
కాగా ఈనెల అంటే 2022 ఫిబ్రవరి 20 సాయంత్రం యాపిల్ యాప్ స్టోర్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు.అలాగే మార్చి చివరి నాటికి అన్ని ప్లాట్ఫార్మ్లపై అందరికీ ట్రూత్ యాప్ అందుబాటులోకి రానుందని తెలిపారు. సోషల్ మీడియాలో రకరకాల కొత్త యాప్స్ వస్తున్నా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్,వాట్సాప్లను ఇప్పటివరకు ప్రజలు ఏంతగానో ఆదరిస్తున్నారు.మరి ఇప్పుడు ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యాప్ ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.ఒకవేళ ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండగలిగితే ట్రంప్కి ఉన్న ఆర్థిక సంపదను ఉపయోగించి ఈ యాప్ ను మరింత ముందుకు వెళ్లడం ఖాయం అంటున్నారు.