‘సుప్రీం హీరో’ సాయిధరమ్ తేజ్ హీరోగా గా సుబ్బు దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ చిత్రం వసూళ్ల పరంగా బాగానే లాభాలు అందుకుంది కానీ సినిమా మాత్రం అంతంతమాత్రంగానే ఉంది అన్న టాక్ ను సంపాదించుకుంది.
నభా నటెష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ముందు ప్రేమ, పెళ్ళి వంటి అంశాలకు దూరంగా ఉండి అందరినీ తన దారిలోకి రమ్మని మోటివేట్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ పరిచయం అయిన తర్వాత అతని జీవితంలో జరిగిన మార్పులే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. థియేటర్లలో సగం సీటింగ్ కెపాసిటీ తో విడుదలైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో హౌస్ఫుల్ బోర్డులు సాధించింది. అయితే ఇప్పుడు ఓటిటి బాట పడుతున్నారు…. కానీ ఓటిటి కంటే ఏటిటి బెటర్ అని చివరికి నిర్ణయించుకున్నారు.
రామ్ గోపాల్ వర్మ తెలుగులో తొలి శ్రీకారం చుట్టిన పద్ధతిని ఈ సినిమా నిర్మాతలు కూడా పాటించబోతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‘ సినిమా ను ‘జీ ప్లెక్స్’ లో ఒకసారి చూసేందుకు 149 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక ఈ చిత్రం జనవరి ఒకటో తేదీ నుండి ప్రేక్షకులకు ‘జీ ఫ్లెక్స్’ లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో వీక్షించేందుకు అందుబాటులోకి రానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!