బిజెపి మహిళా నేత సాదినేని యామిని పై కేసు నమోదు అయిన వెంటనే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు!ఈ విషయంలో జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని టిటిడి ఆద్వర్యంలోని ఎస్వీబీసీ చానలు ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడాన్ని యామిని తీవ్రంగా విమర్శించారు! దీంతో టిటిడి యామిని పై ఫిర్యాదు చేయడంతో తిరుమల లో కేసు నమోదు అయ్యింది. ఈ ఉద౦తం పై సోము వీర్రాజు ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్పందించారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది చాలా గొప్ప విషయమని, ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంత లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎదురు చూశారని, దేశవిదేశాల్లో 250 ఛానల్లు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేశాయని,కానీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువుండే టిటిడి చేయకపోవడాన్ని ఎత్తి చూపితే కేస్ ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు! వెంటనే యామిని పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆయన టిటిడిని,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చర్యతో సోము వీర్రాజు పార్టీ కేడర్ మన్ననలు పొందారు.
అవసర సమయంలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని సోము వీర్రాజు ఇచ్చారు.కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు బిగినింగ్ బాగానే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి!అయితే యామిని విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనక్కు పోతుందా అన్నది ప్రశ్నార్థకం!యామిని టిడిపి అధికార ప్రతినిధిగా ఉంటూ జగన్ తో సహా వైసీపీ నేతలను తీవ్రంగా విమర్శించిన సందర్భాలులున్నాయి!టిడిపి ఓడిపోయాక యామిని బిజెపిలో చేరారు!ఇప్పుడు అవకాశం రావడంతో యామినిని వైసిపి ప్రభుత్వం కేసులో బుక్ చేసిందని భావిస్తున్నారు!కాబట్టి సోమువీర్రాజు ఎంత హడావుడి చేసినా యామిని విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవచ్చని చెబుతున్నారు