బాహుబలితో దేశం గర్వించే సినిమాను అందించిన ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళికి కరోనా పాజిటివ్ అని తేలింది.
తనకు మాత్రమే కాకుండా తన కుటుంబం మొత్తానికి కరోనా సోకిందని రాజమౌళి ట్విట్టర్ లో తెలిపారు. నాకు, నా కుటుంబానికి కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గింది. అయితే ఎందుకైనా మంచిదని మేము కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అందులో మాకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తేలింది. వైద్యులు సూచించిన ప్రకారం మేమంతా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నాం. మేము త్వరగా కోలుకుని మా ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!