Indigo Plant: ఔషధ గుణాలు కలిగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కలలో నీలి మొక్క కూడా ఒకటి..!! నీలి మొక్క ( Indigo Plant) ఇది చూడటానికి వేంపల్లి (Vempalli) చెట్టు లా ఉంటుంది కాకపోతే దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి వీటి కాయలు ఒక అంగుళం పొడవు లో ముదురు రంగులో ఉంటాయి.. ఈ మొక్క రుచి కొంచెం చేదుగా ఉంటుంది. అయినప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. నీలి మొక్క ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందొ ఇప్పుడు చూద్దాం..!!
Indigo Plant: ఒత్తైన నల్లటి కురులకోసం నీలి మొక్కను ఇలా ఉపయోగించండి..!!
నీలి మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసంలో వేపనూనె కలిపి రాసుకుంటే కుష్టు వ్యాధి తగ్గిపోతుంది. గజ్జి, తామర, దురద, అలర్జీని శాశ్వతంగా నయం చేస్తుంది. అన్ని రకాల చర్మ వ్యాధులను (Skin Diseases) తగ్గిస్తుంది. ఈ ఆకు రసాన్ని 15 – 25 ML ప్రతిరోజు తీసుకుంటే అన్ని రకాల లివర్ సమస్యలను తగ్గిస్తుంది. హెపటైటిస్ (Hypatites) వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది. ఈ సమస్య తగ్గి ఎంత వరకు ఈ ఆకుల రసాన్ని ప్రతి రోజూ సేవిస్తూ ఉండాలి. సరిగ్గా మూత్రం రాకపోవడం, మూత్రంలో ఇన్ఫెక్షన్ (Urine Infection) సమస్యలను నివారిస్తుంది. ఈ ఆకుల రసాన్ని సేవిస్తే మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
పాము కాటు (snake Bite), తేలు కాటు లేదా ఏదైనా విష జంతువులు కరిచినపుడు ఆ విషం శరీరానికి ఎక్క కుండా ఉండేందుకు నీలి ఆకుల రసాన్ని 40 – 50ML ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఇలా రెండు లేదా మూడు రోజులు తీసుకుంటే సరిపోతుంది. నీలి మొక్కకు విషాన్ని విరిచేసి ప్రాణాలను రక్షించే గుణాలను కలిగి ఉంది. ఈ ఆకుల తో తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్లు కు పట్టిస్తే జుట్టు నల్లగా తుమ్మెద రెక్కల మారుతుంది. నల్లటి ఒత్తయిన జుట్టు (Black Hair) కోసం ఈ ఆకులను ముద్దగా నూరి తలకు రాసుకుని తరువాత తలస్నానం చేసిన చక్కటి ఫలితం కనిపిస్తుంది..
పుచ్చిపోయిన పళ్ళు, పిప్పి పన్ను నొప్పి తో బాధపడుతున్న వారు ఈ ఆకులను చేతిలో వేసి కలిపి ఉసిరి కాయంత సైజులు చిన్న ఉండలు చేసుకుని పిప్పి పన్ను ఉన్నచోట పెట్టి పై పన్నుతో నొక్కిపట్టి ఉంచాలి. ఈ ఆకులలో ఉన్న రసం పిప్పిపన్ను లోకి వెళ్లి లోపల ఉన్న పురుగులను హరిస్తుంది. దీంతో పిప్పి పన్ను నొప్పి, పిప్పళ్ళు తగ్గిపోతాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నీళ్లు మొక్క వేళ్లను దంచి పొడి చేసుకోవాలి. పావు చెంచా వేర్ల పొడి, నాలుగు మిరియాలు, నాలుగు చిటికెలు అల్లం, తేనె పావుచెంచా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీనిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెదడును చురుకు (Brain Sharp) గా ఉంచుతుంది. మందకొడితనంని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.