వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్ళు పూరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఊరూవాడా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
పార్టీ నాయకులు ఎక్కడికక్కడ పాదయాత్రలు చేశారు. ఇదే సమయంలో సాక్షి పత్రికలో సీఎం జగన్ గురిచంఇ ఓ కథనం వచ్చింది. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
సాక్షిలో కథనంపై కస్సు బుస్సు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తయి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో, దీనిపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందనలపైన టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఫైరయ్యారు. “పాదయాత్రకు మూడేళ్లు అవుతున్న సమయంలో ప్రెస్ మీట్లతో హోరెత్తించారు. వైసీపీ పత్రిక అయిన సాక్షి మీడియాలో కూడా ప్రకటనలు ఇచ్చారు.సాక్షి పేపర్లో జగన్ పాదయాత్ర గురించి బ్రహ్మండంగా యాడ్ ఇచ్చారు. ప్రజానేత పాదయాత్రకు నేటికి మూడేళ్లని, దశ-దిశలా ఉత్సవాలు చేయాలని చెప్పారు. ఎందుకు చేయాలి ఉత్సవాలు, ఏంప్రగతి చేశారని చేయాలి? ప్రజానేత పాదయాత్రకి రాష్ట్రం మూడుదశాబ్దాలు వెనక్కు వెళ్లిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించాలి.“ అంటూ మండిపడ్డారు.
సాక్షిపైనే అసలు టార్గెట్
సాక్షి పత్రికలో ఇచ్చిన ప్రకటనలన్నీ బూటకం, ఈరోజు ఇచ్చినవి మరీ బూటకం అంటూ అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా డప్పులు కొట్టుకోవడం మానేసి, ప్రజల గురించి ఆలోచించండి. చేతనైతే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపితే నడపండి. లేకపోతే దిగిపోండని మనివి చేస్తున్నాను అంటూ అనురాధ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కమిటీలో అనురాధకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.