సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క అరుంధతి, బాహుబలి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా జేజెమ్మ పాత్రలో అనుష్క నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించిన అనుష్క సౌత్ ఇండస్ట్రీ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
మొదటిలో గ్లామర్ పాత్రలు ఎక్కువ చేసిన తర్వాత స్టోరీ ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేయడం జరిగింది. కాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఒక విధంగా అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర తరహాలో అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది. అయితే అంతా హిట్టొచ్చినా గానీ అనుష్క తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.
ముఖ్యంగా సైజ్ జీరో సినిమా చేయడంతో ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అనుష్కా కి అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనుష్క పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయాన్నిదర్శించుకున్నారు. నిన్న బుధవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనుష్క తన స్వస్థలం మంగుళూర్ నుంచి సహచర బృందంతో తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం చేరుకుని అక్కడి నుంచి మరబోటుపై ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీటీ అనుష్క మాట్లాడుతూ కార్తీకమాసంలో గోదావరి నది మధ్యలో ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!