దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసినా గాని ఉన్నంతకాలం భారీ స్థాయిలో అవకాశాలు రాబట్టు కోవడం జరిగింది. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరియర్ కొనసాగిస్తుంది.
ప్రస్తుతం “రష్మి రాకెట్” అనే సినిమా చేస్తోంది. క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అథ్లెటిక్ రన్నర్ గా తాప్సీ నటిస్తోంది. ఈ సినిమాలో తాప్సి భర్తగా ప్రియాన్షు పెన్యులి నటిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో దుస్తుల విషయంలో రాబోయే రోజుల్లో బికినీ వేసుకునే పరిస్థితి ఉండదని తాప్సీ స్టేట్మెంట్ ఇవ్వడం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ ఏమిటంటే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా తాప్సీ అవకాశం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్ కుమార్ హిరాణి – షారూక్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ తాప్సీ కి వచ్చినట్లు సమాచారం.