హైదరాబాదు, మార్చి 6 : ఐటి గ్రిడ్ చైర్మన్ అశోక్పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను పోలీసులు అలెర్ట్ చేశారు.
దేశం విడిచి పారిపోకుండా అశోక్పై పోలీసులు ఎల్ఒసి జారీ చేశారు.
ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటి గ్రిడ్ కంపెనీ వ్యవహారం రాజకీయంగా వివాదం కల్గించింది.
ఈ కేసులో ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ను లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేసినా ఇంత వరకు ఆయన లొంగిపోలేదు.
పోలీసులు అశోక్కు ఇచ్చిన గడువు నిన్నటితో పూర్తి అయ్యింది.
అశోక్ను అరెస్టు చేసేందుకు హైదరాబాదు పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఏ క్షణాన్నైనా అశోక్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.