సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని రాజకీయ నాయకుల భవిష్యత్తు అగమ్యగోచరం గానే ఉంటుంది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ఇదే! ఆయన ట్రాక్ రికార్డు చూస్తే కాంగ్రెస్ లో పులి! అనేకమంది ముఖ్యమంత్రుల క్యాబినెట్లో ఉన్నారు. సామాజిక వర్గ పరంగా కాపు కులస్తుడు.వంగవీటి రంగా తర్వాత ఆ స్థాయిలో సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడంటారు. కాంగ్రెసులో ఉన్నంతకాలం ఆయన టైం బాగానే ఉంది. రాష్ట్ర విభజన తదుపరి ఏపీలో కాంగ్రెస్కు పుట్టగతులుండవని తేలిపోయిన నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రత్యామ్నాయం వైపు చూశారు.
అయితే ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెదొక దారి అన్నట్టుగా కన్నాలక్ష్మీనారాయణ వైసిపి వైపు రాకుండా బీజేపీలోకి వెళ్లిపోయారు.అదే ఆయన చేసిన చారిత్రక రాజకీయ తప్పిదం అంటారు.బీజేపీలో పెద్దగా తనకు ప్రాధాన్యం లభించకపోయేసరికి ఆయన వైసీపీకి జై కొట్టడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారు.ఇక రేపు వైసీపీలో చేరాలని ఫిక్స్ అయిన తరువాత అనూహ్యంగా అమిత్ షా నుంచి కన్నాకు ఫోన్ వచ్చింది. వైసీపీలోకి వెళ్లవద్దని.. నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాం అని చెప్పి వైసీపీలోకి పోకుండా చేశారు. బీజేపీ అయితే జాతీయ పార్టీ పైగా అధికారంలో ఉందని ఆశపడి కన్నా ఆగిపోయాడు. దీంతో ఆయన హాస్పిటల్లో చేరినట్లు కలరిచ్చి వైసిపి వైసీపీలోకి వెళ్లకుండా ఆగిపోయారు .
చివరకు బిజెపి తరపున నర్సరావుపేట ఎంపిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.బిజెపి లోనే ఉండిపోయారు అయినా బిజెపి లోనే కొనసాగుతూ ఆ పార్టీకి తనకు చేతనైన సేవలు చేసినప్పటికీ బీజేపీ అధ్యక్ష పదవిని రెండేళ్ల తరువాత పాపం చంద్రబాబు మీద కోపంతో కన్నాకు తీసివేశారు.. కేంద్ర బీజేపీ నాయకత్వం ఇప్పుడు కన్నాను అస్సలు పట్టించుకోవడం లేదంట.. కనీసం కన్నాకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు అని.. ఆయన మనుషులకు కూడా నోటీసులు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇలా కన్నా పరిస్థితి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అమిత్ షా చేశాడని ఆయన అనుచరవర్గం తెగ బాధపడుతోందట..
వైసీపీలోకి వెళ్లి ఉంటే బొత్స సత్యనారాయణ మాదిరి మంత్రి అయ్యేవాడినని.. ఇప్పుడు ఎటూ కాకుండా పోయానని కన్నా లక్ష్మీనారాయణ మథన పడుతున్నాడంట!ఇప్పుడేమో వైసీపీ ద్వారాలు తెరిచి లేవు.. బీజేపీలో సీను లేదు …టిడిపి పరిస్థితి అస్సలు బాగాలేదు ..జనసేన సోదిలో లేదు ..మరి కన్నా గారు ఏం చేస్తారు ఎలా రాజకీయాల్లో మనుగడ సాగిస్తారు అన్నది వేచిచూడాలి.