Sago: సగ్గుబియ్యం లో రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం, వల్ల సగ్గుబియ్యాన్నీ ఆహారం లో తీసుకోవడానికి బాగా ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్ఉన్నవారు కూడా సగ్గుబియ్యానిసందేహం లేకుండా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి గర్భిణీ స్త్రీలకు కు ఎంతో మేలు కలుగుతుంది .
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి కూడా మంచిది . సగ్గుబియ్యం లో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకలు ఆరోగ్యం గా ఉండేలా చేస్తాయి. అధిక రక్తపోటుని తగ్గిస్తాయి. దీనినుండి లభించే క్యాల్షియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది.
ఆరోగ్యానికి ఇంత మంచి చేసే సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కర్ర పెండలం దుంప తో సగ్గు బియ్యం తయారుచేస్తారు. దీని కోసం దుంపలను భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేరవేయవలిసి ఉంటుంది. ఆ దుంపలను నీటి తో బాగా శుభ్రంచేసి దానిపై ఉన్న తొక్కను యంత్రాలతో వేరుచేస్తారు .
తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళ తో శుభ్రం చేస్తారు. తర్వాత ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. అలా వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళ్లేలా ఏర్పాటుచేస్తారు . ఈ క్రమం లో, పాలలోని చిక్కని పదార్థం ఒక ముద్దలా ఉంటుంది. దాని నుండే సగ్గు బియ్యం తయారు అవుతుంది.
ఈ పిండి వివిధ రకాల పరిమాణం లో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకిచేరుతుంది . ఆ జల్లెడ అటు ఇటు కదలడం వలన ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జలజలా రాలిపడుతుంటుంది .అలా పడినప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి తరువాత వాటిని ఎండలో ఆర బెడతారు.
100 కిలోల సగ్గుబియ్యం కావాలంటే సుమారు 500 కిలోల దుంపల ను వాడాలిసి ఉంటుంది. ఈవిధానం లో సగ్గుబియ్యం తయారు చేస్తారు .ఆంధ్ర ప్రదేశ్ కేరళ, తమిళనాడు, లో తయారి మిల్లులు ఉన్నాయి.