యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ లో నటిస్తున్న 20 చిత్రం రాధే శ్యామ్మ్. జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాని యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా ప్రభాస్ పెదనాన్న సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంతకముందు పక్కా ప్లాన్స్ తో విదేశాలలో షూటింగ్ జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసుకొని షూటింగ్ వెళ్ళి కరోనా కారణంగా అనుకున్న షెడ్యూల్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ టీమ్మ్ మళ్ళీ రాధే ష్యామ్మ్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళారు. 15 రోజుల షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి రానున్నారు.
కాగా ప్రభాస్ 21 సినిమాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 చిత్రంగా ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో లెంజడరీ యాక్టర్స్ ని ఎలా మిస్ చేసుకుంటామని మేకర్స్ అంటున్నారు.
అంతే కాదు ప్రభాస్ కెరీర్ లో అమితాబ్ తో చేయాలన్నది పెద్ద డ్రీం అని ఆ కారంగానే అమితాబ్ ని ఈ సినిమాలో నటింపచేయాలని మేకర్స్ భావించారట. ఇక భారీ పాన్ ఇండియన్ సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేఆలని సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతమందించే అవకాశలున్నాయి. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్ట్ మరింత గ్రాండ్ నెస్ యాడ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.