NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ వైసీపీ టాప్ లీడ‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా… ట్విస్టులే ట్విస్టులు…!

రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న కొద్దీ.. రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవ‌ల పార్టీలు మారిన(ఫిరాయించిన‌) ఎనిమిది మంది(న‌లుగురు వైసీపీ+న‌లుగురు టీడీపీ) ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అన‌ర్హ‌త వేటు వేశారు. అయితే..వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌చ్చా? లేదా? అనే దానిపై ఇంకా చ‌ర్చ కొన‌సాగుతోంది. ఇక‌, దీనిని వారు కోర్టులో స‌వాల్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఇదిలావుంటే, ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వ‌చ్చింది.

There is nothing wrong with these YCP top leaders.
There is nothing wrong with these YCP top leaders.

పార్టీ మారిన ఎమ్మెల్సీల‌పైనా వైసీపీ అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబు తున్నాయి. అధికార‌ వైసీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్ర య్యకు మండలి ఛైర్మన్ మరోసారి నోటీసులు పంపడం చూస్తుంటే వేటు తప్పదనిపిస్తోంది. ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సర్వసహజం. సాధారణంగా ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి వలసలు పెరుగుతాయి. దీనికి తోడు ఎమ్మెల్యే ట్రాన్స్ ఫర్ వంటి వినూత్న పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టడంతో చాలామంది నేతలు ముందే మేల్కొన్నారు.

నియోజకవర్గాన్ని, నమ్ముకున్న వర్గాన్ని వీడటం ఇష్టం లేక…వైసీపీనే వీడారు. అలాంటి వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలేగాక ఎమ్మెల్సీలు ఉన్నారు. జగన్ తీరుతో విభేదించి ఇటీవలే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్య ఆ పార్టీని వీడారు. ఒక‌రు టీడీపీ, మ‌రొక‌రు జ‌నసేన‌లో చేరిపోయారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైసీపీ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు ఇవ్వడంతో గతంలో ఒకసారి నోటీసు పంపారు.

ఇప్పడు మరోసారి నోటీసులు పంపారు. తుది విచారణకు ఈనెల 5న హాజరుకావాలని ఆదేశారు. రెండోసా రి కూడా నోటీసు పంపడం చూస్తే…వీరిద్దరిపైనా వేటు వేయడం ఖాయమని సమాచారం. అయితే.. వీరికి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన ప్ర‌మాదం లేక‌పోయినా.. ఎమ్మెల్సీ ప‌ద‌వులు పోయే అవకాశం ఉంది. కానీ, వీరు న్యాయ‌పోరాటాన్ని ఎంచుకుంటే.. అది తేలే వ‌ర‌కు వీరి ప‌ద‌వుల‌కు ఎలాంటి ఇబ్బందీ రాద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై శాసనసభాపతి వేటు వేశారు.

There is nothing wrong with these YCP top leaders.
There is nothing wrong with these YCP top leaders.

పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులిచ్చిన సభాపతి తమ్మినేని సీతారాం.. ఆతర్వాత వారిపై అనర్హత వేటు వేశారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నరసరాపుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సైతం తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాము తెలుగుదేశంలో చేరామని వారు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వసంత కృష్ణప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయులపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju