దాదాపు 13 ఏళ్ళ తర్వాత లేడీ సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ రావిపూడి అంతక ముందు రవితేజ తో తీసిన రాజా ది గ్రేట్ సినిమాతోనే విజయశాంతి రీ ఎంట్రీ జరగాల్సింది. ఇందుకోసం అనిల్ రావిపూడి బాగానే ట్రై చేశాడు. కాని కుదరలేదు. అందుకే సరిలేరు తో విజయశాంతి రీ ఎంట్రీ జరిగింది.
విజయశాంతి హీరోయిన్ గా పరిచయం అయింది సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాతో అయితే రీ ఎంట్రీ ఇచ్చింది ఆయన కొడుకు సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమాతో. అయితే సరిలేరు తర్వాత అందరు విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ లో వరసగా భారీ ప్రాజెక్ట్స్ లో సినిమాలు చేస్తుందని భావించారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో పవర్ ఫుల్ రోల్స్ లో నటించే అవకాశం వస్తుందనుకున్నారు.
కాని ఎందుకనో అందరు భావించినట్టుగా విజయశాంతి కి భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా విజయశాంతి తన వద్దకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. కథ లో తన పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉండాలని ముందుగానే క్లారిటీగా చెబుతున్నారట.
అదీకాక రెమ్యూనరేషన్ కూడా కాస్త భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సీనియర్ నటి నదియా లాంటి వాళ్ళు వరసగా పెద్ద సినిమాలలో అవకాశాలు అందుకుంటుంటే విజయశాంతి కి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నంతగా సాగడం లేదు. అయితే మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశాలున్నాయని మాత్రం చెప్పుకుంటున్నారు.