విజయవాడ మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వర రావు ఇటీవల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. ఒక ప్రముఖ హోటల్ నుండి హీరోయిన్ తో కలిసి బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారని తన పరువుకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదంతా ప్రత్యర్థులు కుట్ర అని ఫేస్ బుక్ లో ట్విటర్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు ఉమా ఫిర్యాదు చేశారు. ఇలాంటి పోస్టింగులు వల్ల ప్రజలలో తనపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే తరుణంలో సోషల్ మీడియా లో పెట్టిన పోస్టు లో ఉన్న హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదని.. ఆమెకు నాకు అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ విధంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని కచ్చితంగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని… తొందరగా వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఒక్క బోండా ఉమా విషయములో మాత్రమే కాక ఏపీ లో చాలా మంది టిడిపి నేతల విషయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు వైరల్ అవుతున్న ట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. కావాలని పార్టీలో ఉండే బలమైన నేతలపై ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని మరికొంతమంది ఆరోపిస్తున్నారు.