ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందిగామలో వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీల ఈ క్వేషన్ ఎలా ఉన్నప్పటికీ.. టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. `మహిళగా ఆమె సింపతీ కోరలేదు. నాయకురాలిగానే ఆమె పోరాటం చేశా రు. గత నాలుగున్నరేళ్లుగా.. పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో సౌమ్య ముందున్నారు. ఈ సారి ఆమె గెలుపు ఖాయం` అని నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు చెబుతున్న మాట.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు.. వివాద రహితుడు కాదు. అంతేకాదు, ఆయనపై ఎలాంటి అక్రమ ఆరోపణలు కూడా రాలేదు. కానీ, ఆయనపై వ్యతిరేకత ఉందనేది వాస్తవం. ఎలాగంటే.. క్షేత్రస్థాయిలో ఆయన ప్రజలకుదూరంగా ఉంటున్నారనే వాదన ఉంది. ఏదైనా చె ప్పాలని భావించిన.. బెదిరింపు ధోరణితో వ్యవహరించడం కూడా.. ఎమ్మెల్యేకు మైనస్గా మారింది. దీనికి తోడు ఎమ్మెల్యే సోదరుడి వ్యవహారం కూడా పార్టీని ఇబ్బంది పెడుతోంది.
నందిగామ మునిసిపల్ చైర్మన్ పదవిలో ఉన్నన్ని రోజులు ఆమెకు ఎవ్వరి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడం.. ఇటీవల ఆమె మృతిచెందడం… ఇవన్నీ పార్టీ కేడర్తో పాటు ఓ ప్రధాన సామాజిక వర్గంలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచేశాయి. దీంతో పరిస్థితి ఇబ్బందిగానే ఉందనేది వైసీపీ స్థానిక నేతల టాక్ కూడా. ఇక, టీడీపీ తరఫున ఇప్పటికే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిన తంగిరాల సౌమ్య.. గెలుపు తథ్యం అనే మాట వినిపించడానికి ప్రధాన కారణం.. ఆమెప్రజల మనిషిగా గుర్తింపు పొందారు.
నందిగామ నియోజక వర్గం హైవేకి దగ్గరగా ఉంటుంది. ఓ రోజు అర్ధరాత్రి వేళ.. ఆటో ప్రమాదం జరిగి.. నందిగామ వాసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో గాయపడ్డవారు.. ఫోన్ చేసి.. సౌమ్యకు సమాచారం అందించారు. అంతే.. ఆమె అర్ధరాత్రి అని కూడా చూడకుండా.. బాధితులను ఆదుకునేందుకు.. పరుగుపరుగున వచ్చారు. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇటీవల అంగన్ వాడీ కార్యకర్తలు ఉద్యమించారు. వారికి కూడా సౌమ్య అండగా ఉన్నారు.
అంతేకాదు.. పార్టీ తరఫున ఎవరైనా కార్యకర్త వచ్చి.. తనకు ఇబ్బందిగా ఉన్నదని చెబితే.. నేనున్నానంటూ.. ఆమె ఆదుకుంటున్నారు. ఇలా.. పార్టీని, ప్రజలను కూడా ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. చంద్రబాబు ఎవరినీ ఓపట్టాన ప్రశంసించరు. అలాంటి చంద్రబాబు దగ్గర కూడా.. సౌమ్య నూటికి నూరుపాళ్లు మంచి మార్కులు వేయించుకున్నారు. ఇలా.. ఎటు చూసినా.. ఆమెకు సానుకూల పవనాలే వీస్తుండడంతో గెలుపు తథ్యమనే వాదన వినిపిస్తోంది.