విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు.. వైసీపీ కొత్త పదవిని అప్పగించిన విష యం తెలిసిందే. వాస్తవానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సీటును ఆశిం చారు. కానీ, వైసీపీ టికెట్ను పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యేకు అప్పగించింది. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సెంట్రల్ సమన్వయకర్త పగ్గాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు మల్లాది ని పార్టీ ఎటువైపు కదలకుండా చేసిందనే వాదన వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతా నని మల్లాది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లాదిని ఎటూ కదలకుండా.. వైసీపీ అధినేత జగన్ పదవితో ఇరికించారని అంటున్నా రు. విజయవాడ వైసీపీ అధ్యక్షుడిగా తాజాగా ఆయనకు వైసీపీ అధినేత అవకాశం ఇచ్చారు. దీంతో ఇక, పూర్తిగా టికెట్ ఆశలు సన్నగిల్లినట్టేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లాది తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అయినా.. ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
మల్లాదికి టికెట్ లేదని తెలిసిన తర్వాత.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. పెద్ద ఎత్తున ఆయనను సంప్ర దిస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం.. అలెర్టయిందని అంటున్నారు. అయితే, మల్లాది మనిషిగా వైసీపీలో ఉన్నప్పటికీ.. మనసు మాత్రం ఎమ్మెల్యే టికెట్పైనే ఉంది. దీంతో ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ టికెట్ లేకుండా చేయడం.. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎద్దేవా చేయడం వంటి కారణాలతో మల్లాది ఒంటరిపోరుకైనా సిద్ధ పడుతున్నారని అంటున్నారు.
కానీ, ఆర్థికంగా ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో ఆయన ఇంత సాహసం చేస్తారా? అనేది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. తనపై ఉన్న వ్యతిరేకతను కూడా మల్లాది అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత తగ్గుతున్నట్టు అనిపించినా.. మరోవైపు.. మనసు మాత్రం లాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఖర్చుకు ముందుకు వస్తే.. తన పోటీ ఖాయమనే వాదననే ఆయన తన అనుచరులకు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.