Sneha: అందాల నటి ‘స్నేహ’గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఈ అమ్మడు తెలుగు నెటివిటీకి చెందిన నటి కాకపోయినా అచ్చం తెలుగందం ఉట్టిపడేలా ఈమె డ్రెస్సింగ్ స్టైల్, అందం, అభినయం ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. రవితేజ హీరోగా వచ్చిన ‘వెంకీ’సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్న ‘స్నేహ’ వరుస ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ కథాంశాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. సంక్రాంతి, శ్రీ రామదాసు వంటి చిత్రాలతో ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం సినిమాలకు కొంతకాలం దూరమైన ఈ తమిళ భామ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది.
Twitter: సరికొత్త మార్పులతో ట్విట్టర్ ….!
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్నేహ..
స్నేహ సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన నటుడిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. సినిమాలతో పాటే వ్యాపార రంగంలోనూ ఈ అమ్మడు రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు వ్యాపారంలో మోసం చేశారని పోలీసులను ఆశ్రయించింది ఈ భామ. చెన్నైలోని కానత్తూర్ పోలీసుస్టేషన్లో ఇద్దరు బిజినెస్ మెన్స్ పై ఫిర్యాదు చేసింది. ఎక్స్పోర్ట్ కంపెనీలో స్నేహ పెట్టుబడి పెట్టగా ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను మోసం చేయడమే గాక బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిసింది.
Taj Mahal: తాజ్ మహల్ ను ఫ్రీ గా చూడాలి అనుకుంటున్నారా .. అయితే ఇది మీ కోసం …!
రూ.26 లక్షలు పెట్టుబడి పెడితే..
స్నేహ గత కొంత కాలంగా ఈ ఎక్స్పోర్టు కంపెనీలో పెట్టుబడి పెడుతూ వచ్చిందట.. అయితే, ఇంతవరకు తనకు లాభాలపై రిటర్న్స్ ఇవ్వకపోవడంతో పాటు వారు బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం. ఇప్పటి వరకు స్నేహ రూ.26 లక్షలు పెట్టుబడి పెట్టింది. డబ్బులకు వడ్డీ చెల్లించాలని అడిగినందుకు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వీరిపి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు తెలిసింది. అయితే, స్నేహ పోలీస్ స్టేషన్ గడప తొక్కిందని తెలియగా ఆమె అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారని టాక్..