ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పలు సర్వే సంస్థలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రముఖ జాతీయ ఛానెల్ టౌమ్స్ నౌ గత కొద్ది నెలలుగా ఏపీలో ఎవరు గెలుస్తారు ? అనే దానిపై వరుసగా సర్వేలు చేసుకుంటూ వస్తోంది. కొద్ది నెలల క్రితం చేసిన రెండు సర్వేలల్లోనూ వైసీపీకి ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో 24 నుంచి 25 వరకు వస్తాయని చెప్పింది. గత రెండు సర్వేల్లోనూ ఇదే విషయం టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.
అయితే తాజా సర్వేలోనూ ఈ సంస్థ మరోసారి ఏపీలో వైసీపీదే అధికారం అని కుండబద్దలు కొట్టేసింది. అయితే గతంలో టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 25కు 25 వైసీపీయే గెలుస్తుందని చెపితే ఈ సారి 6 సీట్లు తగ్గించేసింది. వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని.. ఇక టీడీపీ – జనసేన కూటమికి 6 సీట్లు వస్తాయని చెప్పింది. ఈ 6 సీట్లు కూడా టీడీపీకే వస్తాయని.. జనసేనకు 1 సీటు కూడా రాదని సర్వే చెప్పడం గమనార్హం.
ఇక జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వే చెప్పింది. ఇక జనసేనకే ఒక్క సీటు రానప్పుడు అసలేం మాత్రం ఓటు షేర్ లేని బీజేపీ, కాంగ్రెస్కు మాత్రం ఒక్క సీటు మాత్రం ఎలా వస్తుంది. ఇక ఓట్ల శాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 47 శాతం.. టీడీపీ కూటమికి 44 శాతం ఓట్లు, బీజేపీకి 2 శాతం, కాంగ్రెస్కు 1 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
గత ఎన్నికల్లో 51 శాతం ఓట్లు పొందిన వైఎస్సార్సీపీ ఇప్పుడు నాలుగు శాతం ఓట్లు కోల్పోవడంతో పాటు 3 లోక్సభ సీట్లను కూడా లాస్ కానుంది. గత ఎన్నికల్లో కేవలం 3 లోక్సభ సీట్లు మాత్రమే సాధించిన టీడీపీ ఇప్పుడు మరో మూడు పెంచుకుని 6 సీట్లు గెలుచుకోనుంది. పార్లమెంటు సీట్ల లెక్క చెప్పిన టైమ్స్ నౌ అసెంబ్లీ సీట్ల ప్రస్తావన తీసుకురాలేదు. టౌమ్స్ నౌ అంచనా ప్రకారం వైసీపీకి 130కు పైగా అసెంబ్లీ సీట్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. టీడీపీకి 40 + సీట్లు రానున్నాయి.