NIA: హైదరాబాద్ లో గురువారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్ లో విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ గా ఉన్న ఎన్ వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీనగర్ లోని రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు చేసినట్లు తెలుస్తొంది. వేణు గోపాల్ నివాసంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి దాదాపు ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ ను కూకట్ పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో సోదాలు చేసినట్లు తెలుస్తొంది.
ఇక, ఎన్ఐఏ అధికారులు రవి శర్మ మొబైల్ తో పాటు పాత పుస్తకాలు, 1990 కంటే ముందు ఉన్న ఫోటోస్ కు చెందిన పాంప్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ఎన్ఐఏ కార్యాలయానికి హజరు కావాల్సిందిగా రవిశర్మకు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ దాడులకు సంబందించి పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
2018 లో పూణె సమీపంలో భీమా కోరేగావ్ లో హింస ప్రేరేపించినందుకు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో గతంలో విరసం నేత, వేణుగోపాల్ మామ వరవరరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Devineni Chandra Shekar: మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట విషాదం .. దేవినేని చంద్రశేఖర్ మృతి