మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకులలో ఒకరు. ఆయనకున్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. జంధ్యాల.. ఈవీవీ గారి తర్వాత మళ్ళీ త్రివిక్రం సినిమాలలోనే ఆరోగ్యకరమైన హాస్యాన్ని చూస్తున్నారు ప్రేక్షకులు. వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చిని చూసే సినిమాలనే ఇప్పటి వరకు త్రివిక్రం అందించాడు. ఆయన రచయితగా ఉన్నా ఆ తర్వాత దర్శకుడిగా మారినా ఆయన కలం లోని బలం రెట్టింపు అయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు.
తన సినిమాలకి కాపీ మరకలు అంటిన్నా సరే చెరిపేసుకొని ముందుకు సాగుతూ అలవైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ ని అందిస్తున్నారు. అందుకే త్రివిక్రం కోసం ఎప్పుడు స్టార్స్ ఎదురు చూస్తుంటారు. సినిమాలో తన హీరోని అన్ని విధాలుగా వెండితెర మీద ఆవిష్కరించడం త్రివిక్రంలోని ప్రత్యేకత. ఇక హీరోయిన్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఏదో పాట కి ముందు వచ్చింది.. పాట అయిపోగానే వెళ్ళిపోయింది అన్నట్టు ఆయన సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు.
హీరో కి సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ ని రాస్తారు. అందంగా చూపిస్తారు. త్రివిక్రం సినిమాలలో హీరోయిన్ ఎంతగా హైలెట్ అవుతుందో అతడు .. జల్సా.. జులాయి..అత్తారింటికి దారేది…అ..ఆ.. అరవింద సమేత వీర రాఘవ.. అల వైకుంఠపురములో..వంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. అందుకే సమంత, పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ కి త్రివిక్రం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఒక్క కాల్ చేసి పిలవాలే గాని రెక్కలు కట్టుకొని వాలిపోతారు. సినిమా అవకాశం ఇస్తాడని కాదు. ఆయన అంటే అంత గౌరవం.
అందుకే ఆయన బర్త్ డే సందర్భంగా పూజా హెగ్డే ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనంటే ఎంత గౌరవాన్ని కృతజ్ఞతని చాటుకుంది. మీ అరవింద .. అమూల్యంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు .. మీకు మంచి సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను.. “గురూజీ సార్.. గురూజీ అంతే” అని తెలిపింది. అంతేకాదు గురూజీ తో ఉన్న ఒక పిక్ ని కూడా షేర్ చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!