నంద్యాల ఎస్పీవై.ఆగ్రో గ్యాస్ లీక్ ఘటనలో కొత్త వివాదం తలెత్తింది. ఈ ప్రమాదోం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని అంబులెన్స్ లోనే మృతి చెందిన ఆయన మృత దేహానికి పోస్టుమార్టం పూర్తైంది. అయితే.. శ్రీనివాసరావు భార్య శ్రీలక్ష్మీ తనకు నష్టపరిహారం కింద రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ 50లక్షలు మాత్రమే ఇస్తానంటుందని.. తన భర్త జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి అని అంటున్నారు.
తన భర్త చనిపోవడానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. పరిహారం విషయం తేల్చే వరకు శ్రీనివాసరావు మృతదేహాన్ని తీసుకోబోమని తేల్చి చెప్పారు. శనివారం కార్బన్ డై ఆక్పైడ్ను లిక్విడ్గా మార్చేందుకు అమోనియంను పంపే ప్రక్రియలో తీవ్రమైన ఒత్తిడి కలిగింది. ఈ సమయంలో గ్యాస్ను పంపడంతో వెల్డింగ్ చేసిన ప్రాంతం వద్ద పైపులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ సమయంలో అక్కడే నిలబడ్డ శ్రీనివాస్ మృత్యువాత పడ్డారు.